సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి జోష్ మీదున్న కీలక సూచీలు చివరివరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. దీంతో సెన్సెక్స్ 342 పాయింట్లు ఎగిసి36,213 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 10880 వద్ద పటిష్టంగా ముగిశాయి. అన్ని సెక్లార్లూ లాభాల పంటపండించాయి.
ముఖ్యంగా ఐటీ, ప్రయివేటు బ్యాంకింగ్ రంగంలోని లాభాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి. యస్బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్ భారీలాభాలనార్జించాయి. టాటా మోటార్స్, వేదాంతా, ఇండియాబుల్స్ హౌసింగ్ఫైనాన్స్, హెచ్పీసీఎల్, గ్రాసిం టాప్ లూజర్స్గా ఉన్నాయి.